: అమరావతిలో మరో ప్రతిష్టాత్మక సంస్థకు శంకుస్థాపన

ఏపీ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. బీఆర్ శెట్టి మెడిసిటీకి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. తుళ్లూరు మండలం దొండపాడు వద్ద ఈ మెడిసిటీ నిర్మాణం జరగనుంది. ఈ మెడిసిటీలో మెడికల్ యూనివర్శిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నాచురోపతి, యోగా కేంద్రాలు, వైద్య పరికరాల తయారీ యూనిట్ లను ఏర్పాటు చేయనున్నారు. మెడిసిటీలో 800 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించనున్నారు. 

More Telugu News