rana: అడ్వాన్స్ బుకింగ్స్ లో 'నేనే రాజు నేనే మంత్రి' ముందంజ!

రేపు అన్ని థియేటర్ల దగ్గర కొత్త సినిమాల సందడి మొదలు కానుంది. 'నేనే రాజు నేనే మంత్రి' .. 'జయ జానకి నాయక' .. 'లై' సినిమాలు భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ మూడు సినిమాలకి కూడా వేటి ప్రత్యేకత వాటికి వుంది. ఎవరి స్టైల్లో వాళ్లు ప్రమోషన్స్ ను కొనసాగిస్తున్నారు. అలాగే ఎవరికి వాళ్లు తమ కంటెంట్ పై బలమైన నమ్మకంతో వున్నారు.

 ఈ మూడు సినిమాలు కూడా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ ను మొదలుపెట్టేశాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో 'నేనే రాజు నేనే మంత్రి' ముందంజలో వున్నట్టుగా తెలుస్తోంది. రెండవ స్థానంలో 'లై' .. మూడవ స్థానంలో 'జయ జానకి నాయక' వున్నట్టుగా సమాచారం. 'నేనే రాజు నేనే మంత్రి' కంటెంట్ లోని కొత్తదనాన్ని జనంలోకి తీసుకువెళ్లడంలో తేజ .. సురేశ్ బాబు .. రానా సక్సెస్ అయ్యారు. ఈ కారణమే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పై ప్రభావం చూపుతోందని చెప్పుకుంటున్నారు.  

More Telugu News