balakrishna: 'పైసా వసూల్' చేయడంలో దూకుడు తగ్గడం లేదు!

మాస్ ఆడియన్స్ ను అలరించడమెలాగో హీరోగా బాలకృష్ణకు .. దర్శకుడిగా పూరీ జగన్నాథ్ కి బాగా తెలుసు. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తోన్న 'పైసా వసూల్' కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతోంది. ఒక్కో రోజున ఒక్కో ఏరియాకి సంబంధించిన డీల్ ను క్లోజ్ చేస్తున్నారట. అలా ఇప్పటికే నైజామ్ .. సీడెడ్ .. ఓవర్సీస్ బిజినెస్ ను క్లోజ్ చేసినట్టుగా వినికిడి.

 గుంటూరు ఏరియా హక్కులను కూడా నాలుగు నుంచి నాలుగున్నర కోట్ల దగ్గర బిజినెస్ క్లోజ్ చేసినట్టు సమాచారం. వైజాగ్ ఏరియాకి సంబంధించిన హక్కుల విషయంలో చర్చలు జరుగుతున్నాయట. ఇప్పటికే రీ రికార్డింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, డీటీఎస్ మిక్సింగ్ కి సిద్ధమవుతోంది. మరో వారం రోజుల్లో ఫస్టు కాపీ వస్తుందనీ .. సెప్టెంబర్ 1న విడుదల చేయడం ఖాయమని చెబుతున్నారు.  

More Telugu News