: జియో కొత్త ఫోన్లు అమ్ముకుంటారా?.. అయితే, ఓకే అంటున్న రిలయన్స్!

రిలయన్స్ జియో తాజా సంచలనం 4జీ ఫీచర్ ఫోన్ లను బల్క్ గా కొనుగోలు చేసి వ్యాపారం చేసుకోవాలని భావించే వారికి శుభవార్త. ఈ ఫోన్ లను కంపెనీలకు భారీ మొత్తంలో అందిస్తామని రిలయన్స్ ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. తొలుత రూ. 1500 చెల్లించి ఈ ఫోన్ కొనుగోలు చేస్తే, మూడేళ్ల తరువాత ఆ డబ్బు వెనక్కు ఇస్తారన్న సంగతి తెలిసిందే.

 ఇక రిజిస్ట్రేషన్ కోసం రిలయన్స్ తన వెబ్ సైట్ లో ఓ పేజీని ఓపెన్ చేసింది. ఇందులో రెండు ఆప్షన్స్ ఉంచింది. అందులో బిజినెస్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఈ ఆప్షన్ వాడుకుంటూ, ఓ వ్యక్తి తన  కాంటాక్ట్‌ నేమ్‌, కంపెనీ పేరు, పిన్‌ కోడ్‌, పాన్‌ లేదా జీఎస్టీఎన్‌ నెంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీ, కాంటాక్ట్‌ చేయాల్సిన వ్యక్తి నెంబర్‌, ఎన్ని డివైజ్‌లు అవసరమో తెలుపుతూ రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది. వారికి ఫోన్లను బల్క్‌ గా రిలయన్స్ అందిస్తుంది. 50 ఫోన్ల వరకూ కావాలన్నా ఇస్తామని, ఆపై బల్క్ ఆర్డర్లను కూడా స్వీకరిస్తామని జియో వెల్లడించింది.

More Telugu News