: జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన యువ స్పిన్నర్!

శ్రీలంకతో జరగనున్న మూడో టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ జడేజా స్థానంలో యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్సర్ పటేల్ భారత జట్టులోకి వచ్చాడు. కొలంబోలో జరిగిన రెండో టెస్టు సందర్భంగా ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు జడేజాపై ఒక టెస్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో, అతని స్థానంలో అక్సర్ పటేల్ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 12వ తేదీన మూడో టెస్టు ప్రారంభం కానుంది. పల్లెకెలేలో ఈ మ్యాచ్ జరగనుంది.

More Telugu News