: విమానంలో రాఖీ పండుగ చేసుకున్న సన్నీ లియోన్.. రాఖీ ఎవరికి కట్టిందో తెలుసా?

బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ రాఖీ పండుగను చేసుకుంది. తన బాడీగార్డ్ యూసుఫ్ కు రాఖీ కట్టి ఆమె రక్షాబంధన్ పండుగను జరుపుకుంది. సన్నీకి సందీప్ వోహ్రా అనే సోదరుడు ఉన్నాడు. అయితే, ఆయన ఇండియాలో లేకపోవడంతో... మరో సోదరుడిగా భావించే యూసుఫ్ కి రాఖీ కట్టింది. ఈ వేడుకను కూడా విమానంలో జరుపుకుంది. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో అప్ లోడ్ చేసింది. ఇటీవలే సన్నీ దంపతులు నిషా అనే చిన్నారిని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News