varun tej: పవన్ ను దృష్టిలో పెట్టుకునే 'ఫిదా' కథ రాశాను : శేఖర్ కమ్ముల

వరుణ్ తేజ్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' చిత్రం, భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. అయితే తాజాగా శేఖర్ కమ్ముల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కథానాయకుడిగా పవన్ కల్యాణ్ ను ఊహించుకుంటూ తాను ఈ కథను రాసుకున్నట్టుగా చెప్పి ఆశ్చర్యపరిచారు.

 'ఫిదా' మూవీ సెకండాఫ్ లో 'ఖుషీ' ఛాయలు కనిపిస్తాయనీ .. అందువలన పవన్ కల్యాణ్ ను ఊహించుకుంటూ ఈ కథను .. కథానాయకుడి పాత్రను రాశానని శేఖర్ కమ్ముల అన్నారు. దిల్ రాజుకి కథ చెప్పినప్పుడు కూడా .. పవన్ కల్యాణ్ అయితే బాగుంటుందని చెప్పానని అన్నారు. ఇంతగా పవన్ ను అనుకుంటూ రాసిన ఈ కథ, ఆయనకి వినిపించకుండానే తెరకెక్కిందంటూ చెప్పుకొచ్చారు.     

More Telugu News