rana: రానాపై అసహనాన్ని చూపించే అవకాశం రాలేదు : తేజ

రానా కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా తెరకెక్కింది. కాజల్  .. కేథరిన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన విడుదల చేయనున్నారు. దర్శకుడు తేజకి కొంచెం కోపం ఎక్కువేననే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది. తాను అనుకున్న అవుట్ పుట్ ను రాబట్టే విషయంలో తేజ కొంతమందిపై చేయి చేసుకున్న సందర్భాలు .. తీవ్రమైన కోపాన్ని ప్రదర్శించిన సందర్భాలు ఉన్నాయని అంటారు.

అలాంటి తేజ .. రానా విషయంలో తాను అసహనాన్ని .. అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశం కూడా రాలేదని చెప్పారు. అందుకు కారణం షూటింగ్ కి వచ్చిన దగ్గర నుంచి 'జోగేంద్ర' పాత్రలోనే రానా ఉండిపోయేవాడని అన్నారు. రానా చాలా తెలివైన నటుడనీ .. అలాంటి ఆర్టిస్ట్ పట్ల తనకి ఏ రోజున అసంతృప్తి అనిపించలేదని ఆయన చెప్పుకొచ్చారు.    

More Telugu News