: మళ్లీ కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. కిలోకు ఒక్కసారిగా రూ.20 పెరుగుదల!

ఉల్లి మళ్లీ కన్నీళ్లు తెప్పిస్తోంది. కిలోకు ఒక్కసారిగా రూ.20 వరకు పెరిగింది. దీంతో నిన్నమొన్నటి వరకు రూ.10-15 పలికిన ఉల్లిపాయలు నేడు రూ.30-35 పలుకుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక నుంచి ఉల్లి దిగుమతి కాకపోవడంతో హైదరాబాద్‌లోని మలక్‌పేట మహబూబ్‌మాన్షన్‌ మార్కెట్లోనే కిలో రూ.30  పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో రూ.36 వరకు అమ్ముతున్నారు. ఉల్లి పండించే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ నుంచి కూడా రోజుకు రెండుమూడు లారీలకు మించి లోడు రాకపోవడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

More Telugu News