: వీల్ చైర్ లోనే ప్రచారం నిర్వహిస్తున్న ఎస్పీవై రెడ్డి!

నంద్యాల ఉపఎన్నికలో టీడీపీకి ఓటు వేయడం ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని ఓటర్లను ఎంపీ ఎస్పీవై రెడ్డి కోరారు. టీడీపీ ప్రచారంలో భాగంగా ఆయన వీల్ చైర్ లోనే తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఆయనతో పాటు ఆయన కుమార్తెలు సుజల, అరవిందరాణి, అల్లుడు శ్రీధర్ రెడ్డిలు కూడా వేర్వేరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం సందర్భంగా ఎస్పీవై రెడ్డి మాట్లాడుతూ, నంద్యాల అభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వం రూ. 1500 కోట్లను కేటాయించినట్టు తెలిపారు. కేవలం టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.

More Telugu News