Shriya: సినిమా కబుర్లు ... సంక్షిప్త సమాచారం!

*  తన కెరీర్లో తొలిసారిగా ఇప్పుడు ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నానని చెబుతోంది అందాలతార శ్రియా. "వీరభోగ వసంతరాయలు చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రను చేస్తున్నాను. ఇలాంటి పాత్ర చేయడం నాకు తొలిసారి. ఆ పాత్రలో నన్ను నేను తెరపై చూసుకోవడానికి ఆత్రుతగా వున్నాను" అని చెప్పింది శ్రియా.    
*  ప్రస్తుతం 'సాహో' సినిమాలో నటిస్తున్న ప్రభాస్ దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా, ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తాడు.
*  మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'భరత్ అను నేను' చిత్రం తదుపరి షెడ్యూల్ షూటింగ్ లక్నోలో జరుగుతుంది. ఇందుకోసం ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 10 నుంచి 22 వరకు లక్నో పరిసరాల్లో ఈ షూటింగ్ నిర్వహిస్తారు.
*  ఇటీవల 'అమీతుమీ' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ప్రస్తుతం తన తదుపరి చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నారు. ఈసారి పూర్తి లవ్ స్టోరీ చేయనున్నానని, వివరాలు త్వరలో వెల్లడిస్తానని ఆయన చెప్పారు.  

More Telugu News