: ఆరోపణల కేసులో ఆప్ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ అరెస్టు

ప్రభుత్వ ఆస్తులను పాడు చేస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. అయితే, సురేంద్రసింగ్ విచారణ నిమిత్తం కోర్టుకు హాజరుకాకపోవడంతో పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. అనంతరం, పటియాలా కోర్టులో హాజరుపరచగా, ఈ నెల 17 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఇదిలా ఉండగా, హోర్డింగ్ లు, పోస్టర్లు అతికిస్తూ ప్రభుత్వ ఆస్తులను పాడుచేస్తున్నారంటూ ఢిల్లీలోని కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే  సురేంద్ర సింగ్ పై నార్నియా ప్రాంత వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More Telugu News