ntr: భారీ రేటుకు 'జై లవ కుశ' సీడెడ్ రైట్స్!

ఎన్టీఆర్ అభిమానులు 'జై లవ కుశ' సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సీడెడ్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. ఒక వైపున ఈ సినిమా షూటింగ్ కొనసాగుతూ ఉండగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఊపందుకుంది.

 సీడెడ్ కి సంబంధించిన హక్కులు 12.6 కోట్లకు అమ్ముడైనట్టుగా చెబుతున్నారు. సీడెడ్ హక్కులు ఈ స్థాయి రేటుకు అమ్ముడు పోవడం ఎన్టీఆర్ కెరియర్లో ఇదే మొదటిసారి అని అంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ 'జై ..లవ .. కుశ' అనే మూడు పాత్రలను పోషిస్తున్నాడు. ఇప్పటికే 'జై' ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. 'రాఖీ' పండుగ సందర్భంగా 'లవ' లుక్ ను ఈ నెల 7వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. ఇక 'లవ' ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో చూడాలి.     

More Telugu News