manchu manoj: 'ఒక్కడు మిగిలాడు' రిలీజ్ డేట్ ఖరారు!

మంచు మనోజ్ కథానాయకుడిగా .. అజయ్ ఆండ్రూస్ దర్శకత్వంలో  'ఒక్కడు మిగిలాడు' తెరకెక్కింది. ఈ సినిమాలో మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. ఎల్టీటీఈ చీఫ్ గాను .. ఓ స్టూడెంట్ గాను ఆయన పవర్ ఫుల్ రోల్స్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో రెజీనా కథానాయికగా నటించింది. సెప్టెంబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

కొంత కాలంగా మంచు మనోజ్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. తాను ఆశిస్తోన్న హిట్ ఈ సినిమా ద్వారా తనకి లభిస్తుందని ఆయన భావిస్తున్నాడు. తన కెరియర్లో ఈ సినిమాకి ప్రత్యేకమైన స్థానం లభిస్తుందని నమ్ముతున్నాడు. మరి ఈ సినిమా ఆయన కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.       

More Telugu News