: అమీర్ పేట మైత్రీవనం వద్ద నడిరోడ్డుపై డ్రగ్స్ కలకలం... ఏడుగురు అరెస్ట్

హైదరాబాద్ లో మరోమారు డ్రగ్స్ కలకలం చెలరేగింది. విద్యా సంస్థల కేంద్రంగా ఉన్న అమీర్ పేటలోని ప్రధాన ప్రాంతమైన మైత్రీవనం వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న ఏడుగురిని గత రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2.5 కిలోల అల్ఫ్రాజోలం, అరకిలో డైజోఫామ్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని ప్రస్తుతం విచారిస్తున్నామని, కోర్టు ముందు ప్రవేశపెట్టి, ఆపై కస్టడీకి తీసుకుంటామని తెలిపారు.

వారు ఎవరెవరికి మత్తు పదార్థాలు సరఫరా చేశారన్న విషయమై వారి సెల్ ఫోన్లను విశ్లేషిస్తున్నట్టు తెలిపారు. రోడ్డుపై వీరి దందా కొనసాగుతోందని తమకు అందిన సమాచారం ప్రకారం, అర్థరాత్రి మూడు వైపుల నుంచి ఒకేసారి దాడి చేసి వీరిని పట్టుకున్నట్టు తెలిపారు. వీరంతా సిద్దిపేట ప్రాంతానికి చెందిన వారని వెల్లడించిన పోలీసులు, బాన్స్ వాడ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నుంచి డ్రగ్స్ తీసుకుని హైదరాబాద్ లోని మరో వ్యక్తికి ఇచ్చేందుకు వచ్చారని తెలిపారు.

More Telugu News