: భారతీయులను హెచ్చరిస్తున్న యూఏఈలోని ఇండియన్ ఎంబసీ

భారతీయులను యూఏఈలోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. విజిటింగ్ వీసాలపై యూఏఈకి రావద్దని సూచిస్తోంది. ప్రతి రోజూ వందలాది మంది కార్మికులు ఉపాధి కోసం వస్తున్నారని, ఇలా విజిటింగ్ వీసాలపై వచ్చే భారతీయులు భారీ ఎత్తున మోసపోతున్నారని యూఏఈలోని ఇండియన్ ఎంబసీ చెబుతోంది. చాలా మంది భారతీయులు విజిటింగ్ వీసాతో పని కోసం వస్తూ మోసపోతున్నారని తెలిపింది.

తమకు ప్రతిరోజూ వందల కొద్దీ ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పింది. విజిటింగ్‌ వీసాలపై 2016లో యూఏఈకి వచ్చిన 225 మంది భారతీయులతో పాటు 2017లో ఇప్పటివరకు 186 మందికి టికెట్లు కొనుగోలు చేసి ప్రభుత్వం వెనక్కి పంపిందని తెలిపింది. భారత్ లో నకిలీ వీసాలను గుర్తించటం చాల కష్టమని తెలిపింది. దీంతో యూఏఈకి వచ్చే భారతీయులెవరైనా సరే నమ్మకమైన వారి ద్వారా కచ్చితమైన ఉద్యోగ వీసా పత్రంతో పాటు ధ్రువీకరణ పత్రాలను కూడా పొందాలని లేని పక్షంలో కష్టాలు తప్పవని హెచ్చరించింది.

More Telugu News