sai dharam tej: 'కోతల రాయుడు'గా కనిపించనున్న సాయిధరమ్ తేజ్!

సాయిధరమ్ తేజ్ 'నక్షత్రం' .. 'జవాన్' సినిమాలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తరువాత ప్రాజెక్టును ఆయన మారుతి దర్శకత్వంలో చేయనున్నట్టు తెలుస్తోంది.

గీతా ఆర్ట్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ 'కోతల రాయుడు'గా కనిపిస్తాడని చెబుతున్నారు. నలుగురి ముందు నానా రకాల కోతలు కోసేసి వాళ్లని బుట్టలో పడేస్తుంటాడట. గతంలో ఇదే టైటిల్ తో చిరంజీవి చేసిన సినిమా, మాస్ మసాలా మూవీగా నిలిచింది. అదే క్యారెక్టరైజేషన్ తో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. టైటిల్ కూడా అదే పెట్టే అవకాశం కూడా ఉందండోయ్!

More Telugu News