: నంద్యాలలో వైసీపీ భారీ బహిరంగ సభ...ఎస్పీజీ గ్రౌండ్ కు చేరుకున్న వైఎస్ జగన్

కర్నూలు జిల్లా నంద్యాలలో వైసీపీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ ప్రారంభమైంది. స్థానిక ఎస్పీజీ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న ఈ సభకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు చేరుకున్నారు. వైసీపీ అధినేత జగన్ కొంచెం సేపటి క్రితం ఇక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్ కు అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాగా, అంతకుముందు, వైసీపీ నాయకులు మాట్లాడారు. నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డిని గెలిపించుకుని తీరుతామని జగన్ అభిమానులు చెబుతుండటం గమనార్హం.

More Telugu News