: ఏపీలో అవినీతి అన్న మాటే లేదు... ఎవరైనా సరే మేమేసే సిమెంట్ రోడ్ల మీదే నడవాలి: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ లో అవినీతికి ఆస్కారమే లేదని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఒక టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆదేశాల మేరకు సమన్వయంతో పని చేస్తున్నామని అన్నారు. కేంద్రం నుంచి అద్బుతమైన సహకారం అందుతోందని ఆయన చెప్పారు. అభివృద్ధికి ప్రతిపక్షం అడ్డు పడుతోందని ఆయన విమర్శించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేశామని అన్నారు. ప్రజలు మెరుగైన పాలన కోరుకుంటున్నారని, దానిని తాము అందిస్తున్నామని చెప్పారు.

పట్టిసీమ పూర్తి చేశామని, పోలవరం, రాజధాని పనులను 2019 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. 2018 నాటికి ఏపీలోని అన్ని ప్రాంతాల్లో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఏపీలోని పల్లెలు, పట్టణాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నామని, ఏపీలో అధికార, విపక్ష నేతలు ఎవరైనా సరే తాము వేసిన రోడ్ల మీదే నడవాలని ఆయన చెప్పారు. 

More Telugu News