: శిల్పా ను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాకే వైసీపీలోకి రమ్మంటున్న జగన్!

నంద్యాల టీడీపీ నేత, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి టీడీపీకి ఈ రోజు ఉదయం గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. వైసీపీలో చేరనున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. వారి సమావేశం సుమారు గంటపాటు జరిగిందని సమాచారం. అయితే, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాతే తమ పార్టీలోకి రావాలని జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో, శిల్పా చక్రపాణిరెడ్డి ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో పడ్డారని సమాచారం. జగన్ బయటకు వెళ్లినప్పటికీ, శిల్పా ఇంకా అక్కడే ఉన్నారని, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మధ్యవర్తిత్వం వహిస్తున్నారని సమావేశం.

More Telugu News