nagachaithanya: మరో మారు చైతూ జోడీగా పూజా హెగ్డే!

గ్లామర్ పరంగా పూజా హెగ్డేకి 'దువ్వాడ జగన్నాథం' చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో యూత్ లో ఒక్కసారిగా ఆమెపై క్రేజ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో చాలామంది దర్శక నిర్మాతలు తమ తదుపరి సినిమాల కోసం ఆమెను సంప్రదిస్తున్నారు. అలా తనకి వచ్చిన అవకాశాల్లో ముందుగా ఆమె మైత్రీ మూవీ మేకర్స్ వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.

 మైత్రీ మూవీ మేకర్స్ వారు .. చందూ మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఆయన నాగచైతన్య కథానాయకుడిగా ఒక సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ప్రేమమ్' హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అలాగే చైతూతో పూజా హెగ్డే చేయడం కూడా రెండవ సారే. ఈ ఇద్దరూ కలిసి 'ఒక లైలా కోసం' చేశారు. ఫస్టు మూవీ ఓ మాదిరిగా ఆడేసింది .. ఇక సెకండ్ మూవీతో హిట్ కొడతారేమో చూడాలి.      

More Telugu News