rakul: నివేదా థామస్ యాక్టింగ్ సూపర్ .. సాయిపల్లవి నటన ఇంకా చూడలేదు : రకుల్

'రారండోయ్ వేడుక చూద్దాంతో ఇటీవలే హిట్ ను అందుకున్న రకుల్, పెద్దగా గ్యాప్ లేకుండానే ఈ నెల 11న 'జయ జానకి నాయక'తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ సినిమాలో తాను 'జానకి' పాత్రను పోషించానని చెప్పింది. జీవితాన్ని ముందు సంతోషంగా గడుపుతూ .. ఆ తరువాత సమస్యల్లో చిక్కుకునేదిగా జానకి పాత్ర ఉంటుందని అంది. ఇంతటి డీప్ లవ్ స్టోరీ ఈ మధ్యకాలంలో రాలేదని చెప్పింది.

 ఇక తెలుగులో ఆమెకి పెరుగుతోన్న పోటీని గురించి ప్రస్తావించగా, తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ఈ మధ్య కాలంలో వచ్చిన కథానాయికలలో నివేదా థామస్ చాలా బాగా చేస్తోందనీ, 'నిన్నుకోరి' చూశానని చెప్పింది. ఇక సాయి పల్లవి చాలా బాగా చేస్తుందని విన్నాను గానీ .. ఇంకా చూడలేదని అంది. కొత్తగా ఎంత మంది వచ్చినా తాను పోటీగా భావించననీ, ఇక్కడ ఎవరి అవకాశాలు వాళ్లకి ఉంటూనే ఉంటాయని చెప్పుకొచ్చింది.    

More Telugu News