sharwanand: 'మహానుభావుడు' షూటింగులో బిజీగా శర్వానంద్!

'శతమానం భవతి'తో హిట్ కొట్టిన శర్వానంద్ .. 'రాధ' సినిమాతో ఫరవాలేదనిపించుకున్నాడు. ఆ తరువాత సినిమాగా ఆయన 'మహానుభావుడు' చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మెహ్రీన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. కథాపరంగా ఇక్కడ 'జాతర' సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.


 శర్వానంద్ .. మెహ్రీన్ .. నాజర్ తదితరులు ఈ సన్నివేశాలలో పాల్గొంటున్నారు. కొన్ని రోజుల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్, ఈ నెల 5వ తేదీ వరకూ కొనసాగనుంది. 'బాబు బంగారం' ఏవరేజ్ అనిపించుకోవడంతో, ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో మారుతి వున్నాడు. ఆయన పట్టుదల శర్వానంద్ కి ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.   

More Telugu News