mahesh babu: భారీ రేటుకు 'స్పైడర్' ఓవర్సీస్ హక్కులు!

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు .. ఓవర్సీస్ లోను మహేశ్ బాబుకి మంచి మార్కెట్ వుంది. ఈ విషయాన్ని ఆయన గత చిత్రాలు నిరూపిస్తూ వచ్చాయి. అదే జోరు 'స్పైడర్' సినిమా విషయంలోను కనిపించనున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ హక్కులను సొంతం చేసుకుందట. అందుకుగాను వాళ్లు 15.2 కోట్లను చెల్లించినట్టు సమాచారం.

మహేశ్ బాబు కెరియర్లో ఓవర్సీస్ కి సంబంధించి ఈ స్థాయి రేటు పలకడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. హీరోగా మహేశ్ బాబుకి గల క్రేజ్ .. దర్శకుడిగా మురుగదాస్ కి గల ఇమేజ్ కూడా ఓవర్సీస్ హక్కులు ఈ స్థాయి రేటుకు పోవడానికి కారణంగా చెబుతున్నారు. రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానుంది.    

More Telugu News