: వినికిడి లోపం ఉన్న‌వారికి సాయం చేయ‌నున్న ప్రియాంక చోప్రా

వినికిడి లోపంతో బాధ ప‌డుతున్న‌వారికి స‌రైన అవ‌కాశాలు, చికిత్స‌లు, వినికిడి ప‌రిక‌రాలు ఉచితంగా అంద‌జేసే స్వ‌చ్ఛంద సంస్థ హియ‌ర్ ద వ‌ర‌ల్డ్ ఫౌండేష‌న్‌, గ్లోబ‌ల్ స్టార్‌ ప్రియాంక‌చోప్రాను త‌మ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంచుకుంది. అంత‌ర్జాతీయ గుర్తింపు ఉన్న ప్రియాంక చోప్రాను బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంచుకోవ‌డం వ‌ల్ల త‌మ సంస్థ ఆశ‌యాలు ప్ర‌పంచ న‌లుమూల‌ల‌కు వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంటుంద‌ని స్వ‌చ్ఛంద సంస్థ పేర్కొంది.

సింగ‌ర్‌, ఫొటోగ్రాఫ‌ర్ బ్రాయ‌న్ ఆడమ్స్‌తో క‌లిసి ఆమె ఈ స్వ‌చ్ఛంద సంస్థ ప‌నుల్లో భాగం కానున్నారు. ఈ సంస్థ కోసం చేసిన ఫొటోషూట్ వివ‌రాల‌ను ప్రియాంక త‌న ఇన్‌స్టాగ్రాంలో వెల్ల‌డించారు. బ్రాయ‌న్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని ఆమె పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం రెండు హాలీవుడ్ సినిమాలు, క్వాంటికో టీవీ సిరీస్ మూడో భాగం షూటింగుల‌తో బాగా బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా సామాజిక కార్య‌క్ర‌మాల‌కు కొంత స‌మ‌యాన్ని కేటాయించ‌డంపై అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

More Telugu News