rana: 'నేనే రాజు నేనే మంత్రి'లో జోగేంద్ర ఆత్మాహుతి?

తేజ దర్శకత్వంలో రానా కథానాయకుడిగా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా తెరకెక్కింది. కాజల్ కథానాయికగా నటించిన ఈ సినిమా, పొలిటికల్ డ్రామా నేపథ్యంలో కొనసాగుతుంది. ఈ సినిమాలో రాజకీయ నాయకుడైన 'జోగేంద్ర' పాత్రలో రానా కనిపించనున్నాడు. ఈ సినిమా క్లైమాక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ .. ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యచకితులను చేస్తుందనే వార్తలు ఒకటి రెండు రోజులుగా వినిపిస్తున్నాయి.

 ముఖ్యమంత్రిగా వున్న రానా క్లైమాక్స్ లో ఆత్మాహుతికి పాల్పడతాడనే టాక్ వినిపిస్తోంది. అవినీతిపరులైన ఎమ్మెల్యేలందరినీ ఈ బ్లాస్ట్ కి బలి చేస్తాడని అంటున్నారు. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ క్లైమాక్స్ తప్పకుండా నచ్చుతుందని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి. 'జోగేంద్ర' పాత్రతో రానా క్రేజ్ మరింతగా పెరిగిపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

More Telugu News