shraddha kapoor: 'సాహో'లో ప్రభాస్ జోడిగా శ్రద్ధా కపూర్ ఖరారైనట్టే!

యూవీ క్రియేషన్స్ బ్యానర్లో కొన్ని రోజుల క్రిందట 'సాహో' సినిమా షూటింగ్ మొదలైంది. విలన్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ముంబైలో చిత్రీకరించారు. తరువాత షెడ్యూల్స్ ను అబుదాబిలోను .. యూరప్ కంట్రీస్ లోను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ న్యూ లుక్ కోసం ట్రై చేస్తున్నాడు.

 ఈ సినిమాలో కథానాయికగా పరిణీతి చోప్రా .. అలియాభట్ .. పూజా హెగ్డే పేర్లు వినిపించాయి. అయితే కొన్ని కారణాల వలన వాళ్లను పక్కనపెట్టేసినట్టు సమాచారం. తాజాగా శ్రద్ధా కపూర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తాము అనుకున్న బడ్జెట్ కి ఆమె అంగీకరించడమే కాకుండా .. ఫిజిక్ పరంగా ప్రభాస్ కి కరెక్టుగా సెట్ అవుతుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. కనుక దాదాపు ఆమె ఎంపిక ఖరారైపోయినట్టేనని చెబుతున్నారు. 

More Telugu News