balakrishna: ఖమ్మంలో 'పైసా వసూల్' ఆడియో వేడుక!

మాస్ ఆడియన్స్ ను అలరించడంలో హీరోగా బాలకృష్ణకి ఒక స్టైల్ ఉంటే .. దర్శకుడిగా పూరీ జగన్నాథ్ కి ఒక మార్క్ వుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'పైసా వసూల్' వస్తుండటంతో, సహజంగానే అందరిలో ఆసక్తి వుంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కోసం అభిమానులు చాలా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆడియో వేడుకను ఆగస్టు 17వ తేదీన నిర్వహించనున్నారు.

 అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకకి 'ఖమ్మం' వేదిక కానుంది. ఖమ్మంలోని ఎస్. ఆర్. అండ్ బి.జి.ఎన్.ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో ఈ వేడుకను జరపనున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్లను కూడా వదిలారు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు. మరి ఆయన అందించిన ఆడియో ఆడియన్స్ ను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.   

More Telugu News