pavan kalyan: పవన్ నెక్స్ట్ మూవీ మరింత ఆలస్యం!

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ చేస్తోన్న చిత్రం సెట్స్ పై వుంది. ఇప్పటికే కొంత భాగాన్ని చిత్రీకరించగా .. మరికొంత భాగాన్ని తెరకెక్కించవలసి వుంది. ఈ సినిమా తరువాత ఆయన మైత్రీ మూవీస్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్టు చేయనున్నాడు. అయితే ఆ ప్రాజెక్టు మొదలు కావడానికి చాలా సమయం పట్టేలా వుంది. అక్టోబర్ నుంచి ఎక్కువ సమయాన్ని రాజకీయాలకి కేటాయిస్తానని పవన్ ప్రకటించడమే అందుకు కారణం.

 ప్రస్తుతం పవన్ ఒక వైపున సినిమాలు .. మరో వైపున రాజకీయాలకి సమాన ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. సినిమాలు చేస్తోన్న సమయంలో ఆయన కొన్ని సామాజిక సమస్యలపై వెంటనే స్పందించలేకపోతున్నాడు. ఫలితంగా వ్యతిరేక వర్గం నుంచి అనేక విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా అక్టోబర్ నుంచి ఎక్కువ సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తానని పవన్ చెప్పాడు. దాంతో మైత్రీ మూవీస్ బ్యానర్లో ఆయన తదుపరి సినిమా పట్టాలెక్కడానికి మరింత ఆలస్యం అవుతుందనేది స్పష్టమవుతోంది. 

More Telugu News