ram: మేఘా ఆకాశ్ స్థానంలో లావణ్య త్రిపాఠి

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. స్రవంతి మూవీస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయికలుగా అనుపమ పరమేశ్వరన్ ను .. మేఘా ఆకాశ్ ను తీసుకున్నారు. అయితే మేఘా ఆకాశ్ ప్లేస్ లో లావణ్య త్రిపాఠిని ఎంపిక చేశారనేది తాజా సమాచారం.

ఈ సినిమా లాంచ్ కి కూడా మేఘా ఆకాశ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె నితిన్ జోడీగా 'లై' సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఫారిన్లో జరుగుతుండటం వలన, ఆమె డేట్స్ సర్దుబాటు కాలేదట. అందువలన ఆమె ప్లేస్ లో లావణ్య త్రిపాఠిని తీసుకున్నట్టు సమాచారం. మొత్తానికి ఒక మంచి ప్రాజెక్టులో లావణ్య త్రిపాఠి ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా ఫస్టు లుక్ ను ఆగస్టు 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

More Telugu News