: రేవంత్ రెడ్డి అరెస్ట్... గాంధీనగర్ పీఎస్ లో టీడీపీ నేత!

తెలంగాణలో డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందని, మాదకద్రవ్యాల మహమ్మారిని వెంటనే అరికట్టి, దీని వెనకున్న పెద్దలను శిక్షించాలని డిమాండ్ చేస్తూ, తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తూ అసెంబ్లీ వైపు బయలుదేరగా, ట్యాంక్ బండ్ సమీపంలో పోలీసులు ఆపారు. ఆ సమయంలో పోలీసు అధికారులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పాదయాత్ర చేపడితే, అడ్డుకోవడం ఏంటని రేవంత్ మండిపడ్డారు. అనుమతిలేని యాత్ర కాబట్టి అడ్డుకున్నామని స్పష్టం చేసిన పోలీసులు, రేవంత్ ను అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. స్టేషన్ ముందు నిరసన తెలిపిన రేవంత్ రెడ్డి, ఈ కేసు వెనుక తెరాస పెద్దల పాత్ర ఉందని, అందువల్లే విచారణను తప్పుదారి పట్టిస్తున్నారని నిప్పులు చెరిగారు.

More Telugu News