: బరువెక్కిన హృదయంతో అధికారిక నివాసాన్ని వీడిన నవాజ్.. ముర్రేలోని హిల్‌ రిసార్ట్‌కు మకాం!

పనామా పత్రాల వ్యవహారంలో పదవి కోల్పోయిన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదివారం బరువెక్కిన హృదయంతో తన అధికారిక నివాసాన్ని వీడారు. సతీమణి కుస్లుం నవాజ్, కుమార్తె మరియం నవాజ్, అల్లుడు సఫ్దార్‌తో కలిసి ఇస్లామాబాద్ సమీపంలోని ముర్రేలో ఉన్న హిల్ రిసార్ట్‌కు చేరుకున్నారు. నివాసాన్ని వీడే ముందు అక్కడి సిబ్బందిని కలిశారు. మరోవైపు కొత్త ప్రధాని కోసం అధికారిక నివాసాన్ని ముస్తాబు చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాజ్‌ ప్రధాని పదవికి అనర్హుడంటూ పాక్ సుప్రీంకోర్టు ప్రకటించడంతో షరీఫ్ తన పదవికి రాజీనామా చేశారు.

More Telugu News