: నితీష్ కుమార్ రాజకీయ ఎత్తుగడలను యోగాసనాలతో పోల్చిన సుబ్రహ్మణ్య స్వామి!

గత ఎన్నికల అనంతరం ఆర్జేడీతో జట్టుకట్టి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన నితీష్ కుమార్... అవినీతి ఆరోపణల నేపథ్యంలో తాజాగా లాలూకి కటీఫ్ చెప్పి, గతంలో చెయ్యిచ్చిన బీజేపీతో పొత్తు పెట్టుకుని విశ్వాస పరీక్షలో నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ తీరుపై దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. రాజకీయాల్లో నైతిక విలువల అంశం తెరమీదికి వచ్చింది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ పై నేరుగా ఎలాంటి విమర్శలు చేయని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి, నితీష్ కుమార్ రాజకీయ విన్యాసాలను యోగాసనాలతో పోల్చుతూ కార్టూన్ ఒకటి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. అది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దానిని మీరు కూడా చూడండి. 

More Telugu News