balakrishna: తన రికార్డును తానే అధిగమించిన బాలకృష్ణ!

బాలకృష్ణ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'పైసా వసూల్' రెడీ అవుతోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక 'స్టంపర్' ను రిలీజ్ చేశారు. ఈ స్టంపర్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

 యూట్యూబ్ ట్రెండింగ్ లో ఈ స్టంపర్ ప్రథమ స్థానంలో వుంది. రిలీజ్ చేసిన 23 గంటల్లోనే ఈ స్టంపర్ కి 2.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. గతంలో 'గౌతమీ పుత్ర శాతకర్ణి' ట్రైలర్ కి వచ్చిన వ్యూస్ రికార్డును ఈ స్టంపర్ అధిగమించింది. ఇలా బాలకృష్ణ తన రికార్డును తానే అధిగమించాడు. పూరీ జగన్నాథ్ మార్క్ టేకింగ్ .. బాలకృష్ణ స్టైలీష్ లుక్ .. ఈ స్టంపర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక డైలాగ్స్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందువల్లనే ఈ స్థాయి వ్యూస్ వచ్చాయని చెప్పుకుంటున్నారు.    

More Telugu News