easha: మరో సౌందర్య అనిపించుకోవాలని ఉందట!

తెలుగు తెరపై కథానాయికగా నిలదొక్కుకోవడానికి ఓ తెలుగమ్మాయి తనవంతు ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్ కి చెందిన ఆ అమ్మాయి పేరే 'ఈషా'. గతంలో 'బందిపోటు' .. 'అమీతుమీ' సినిమాలు చేసిన ఈ అమ్మాయి 'దర్శకుడు' సినిమా ద్వారా వచ్చేనెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 ఈ సందర్భంగా ఈషా మాట్లాడుతూ .. ఈ సినిమాలో ఫ్యాషన్ డిజైనర్ 'నమ్రత'గా తాను కనిపిస్తానని అంది. ఈ పాత్ర తనకి ఎంతో సంతృప్తిని ఇచ్చిందనీ .. తనకి మరింత గుర్తింపు తెస్తుందనే నమ్మకం ఉందని చెప్పింది. నటన విషయంలో సౌందర్య తనకి స్ఫూర్తి అనీ .. మరో సౌందర్య అనిపించుకోవాలని ఉందని అంది. 'పెళ్లి చూపులు' తరహా సినిమాల్లో చేయడానికి తాను మరింత ఉత్సాహాన్ని చూపుతాననీ .. ఆ తరహా పాత్రలు వస్తాయనే ఆశిస్తున్నానని చెప్పుకొచ్చింది.

More Telugu News