: సోషల్ మీడియాలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఫొటో వైరల్!

కేంద్ర జౌళి శాఖామంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్ అయింది. భర్త జుబిన్‌తో ఉన్నప్పటి పాత ఫొటో ఒకదానిని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దానికి అద్భుతమైన, అందమైన క్యాప్షన్ రాశారు. ‘జీవితంలో బాగా ఇష్టపడిన వాటిని, ప్రేమించిన వాటిని, ఆనంద క్షణాలను గుర్తుంచుకోవడానికి జ్ఞాపకం ఓ మార్గం’ అని రాశారు. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. వ్యక్తిగత వివరాలను బయటపెట్టడంలో ముందుండే మంత్రి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎక్కువగా కుటుంబ, వ్యక్తిగత వివరాలను పోస్ట్ చేస్తుంటారు.

More Telugu News