: విచారణ ముగిసింది... నమూనాలిచ్చేందుకు నిరాకరించిన రవితేజ!

డ్రగ్స్ దందాపై రవితేజ సిట్ విచారణ ముగిసింది. సుమారు తొమ్మిది గంటలపాటు రవితేజ విచారణ జరిగింది. అనంతరం రవితేజ మీడియాకు చేతులు జోడిస్తూ మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు. నేటి ఉదయం పది గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన రవితేజను సిట్ అధికారులు సాదరంగా ఆహ్వానించారు. పరిచయ కార్యక్రమాల అనంతరం రవితేజపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.

ఉదయం నవ్వుతూ సిట్ కార్యాలయానికి వచ్చిన రవితేజ... వెళ్లిపోయే సమయంలో కాస్త ముభావంగా కనిపించాడు. వేగంగా నడిచి వెళ్తూ కారెక్కాడు. కాగా, సుదీర్ఘ కాలం విచారణ ఎదుర్నొన్న రవితేజ లంచ్ చేయని సంగతి తెలిసిందే. ఆ సమయంలో సిట్ అధికారులు ఇచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. సిట్ అధికారులు శాంపిల్స్ అడుగగా, రవితేజ నిరాకరించినట్టు సమాచారం. 

More Telugu News