: పాక్ ప్రధానిగా జిహాదీని నియమించాలి: ఉగ్రవాద నాయకుడి డిమాండ్

పాకిస్థాన్ ప్రధాని పదవి నుంచి నవాజ్ షరీఫ్ వైదొలగిన నేపథ్యంలో ఆ పదవిలో జిహాదీని నియమించాలని జమాత్ ఉద్ దవా సెకెండ్ కమాండర్ అబ్దుల్ రహమాన్ మక్కి డిమాండ్ చేశాడు. తాజాగా ఆయన మాట్లాడుతున్నట్టు వెలువడిన వీడియోలో, అల్లాకు వ్యతిరేకంగా పని చేస్తున్న నవాజ్ షరీఫ్ పదవీచ్యుతుడు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. దేశానికి జిహాదీ నాయకత్వం వహించాలని అభిలషించాడు. పని ఇప్పుడే ప్రారంభమైందని చెబుతూ, అల్లాకు ధన్యవాదాలు తెలిపాడు. జిహాద్, అల్లాకు వ్యతిరేకంగా నవాజ్ షరీఫ్ పని చేశాడని ఆయన ఆరోపించాడు. 

More Telugu News