: హైదరాబాద్- వాషింగ్ట‌న్ నేరుగా విమాన స‌ర్వీసు.... ప్ర‌క‌టించిన మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు

ఇక హైద్రాబాద్‌, ఢిల్లీ మీదుగా నేరుగా వాషింగ్ట‌న్ చేరుకునే అవ‌కాశాన్ని కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు క‌ల్పించారు. ఈ మార్గాల్లో ఎయిరిండియా విమాన స‌ర్వీసుల‌ను ప్రారంభించిన‌ట్లు ఆయ‌న పార్ల‌మెంట్‌లో ప్ర‌క‌టించారు. అమెరికాకు విమాన స‌ర్వీసుల గురించి ఎంపీ వినోద్ కుమార్ అడిగిన ప్ర‌శ్న‌కు అశోక్ గ‌జ‌ప‌తిరాజు లిఖిత పూర్వ‌క స‌మాధానం ఇచ్చారు. హైద్రాబాద్ - ఢిల్లీ, వాషింగ్ట‌న్ - ఢిల్లీ - హైద్రాబాద్ మార్గాల్లో ప్ర‌తి బుధ‌, శుక్ర‌, ఆది వారాల్లో విమాన స‌ర్వీసు అందుబాటులో ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు. అలాగే అమెరికాలోని లాస్ ఏంజెలీస్, హ్యూస్ట‌న్ ప్రాంతాల‌కు కూడా అవ‌స‌రాన్ని బ‌ట్టి విమాన స‌ర్వీసుల‌ను క‌ల్పిస్తామ‌ని అశోక్ గ‌జ‌ప‌తిరాజు తెలియ‌జేశారు.

More Telugu News