maheshbabu: మహేశ్ మూవీలో ఎనిమిది నిమిషాల సీన్ కోసం 20 కోట్ల ఖర్చు!

మహేశ్ బాబు అభిమానులంతా 'స్పైడర్' సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దాదాపు 120 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఒక సీన్ కోసమే 20 కోట్లవరకూ ఖర్చు చేశారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమాలో విలన్ గా నటిస్తోన్న ఎస్.జె.సూర్య ఓ రసాయన బాంబ్ తో ఒక పాఠశాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తాడట. అతణ్ణి అడ్డుకోవడానికి తన శక్తిమేరకు మహేశ్ బాబు పోరాడతాడు. 8 నిమిషాల సేపు సాగే ఈ సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా వుంటుందట. అందువలన ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా 20 కోట్ల ఖర్చుతో ఈ సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ సీన్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది.

More Telugu News