pooja hegde: ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే పేరే జోరుగా వినిపిస్తోంది!

ప్రభాస్ అభిమానుల దృష్టి ఇప్పుడు 'సాహో' పైనే వుంది. సుజీత్ దర్శకత్వంలో .. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయిక ఎవరనే విషయంలో ఇంతవరకూ క్లారిటీ రాలేదు. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్ ను సంప్రదించారు.

 అయితే వాళ్లు డిమాండ్ చేసిన పారితోషికం చుక్కల్లో ఉండటంతో, అనుష్కనే తీసుకుందామని భావించి, ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఆమె కూడా డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పడంతో అయోమయంలో పడ్డారు. 'దువ్వాడ'లో గ్లామర్ పరంగా దుమ్ములేపిన పూజా హెగ్డే ను సంప్రదిస్తున్నారనేది తాజా వార్త. ఆమె తప్పకుండా అంగీకరిస్తుందనే అంతా అనుకుంటున్నారు.

More Telugu News