: శ్రీలంకను ఆదిలోనే దెబ్బ తీసిన ఉమేష్ యాదవ్

గాలేలో భారత్ తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 7 పరుగుల వద్ద ఓపెనర్ కరుణరత్నే (2)ను ఉమేష్ యాదవ్ పెవిలియన్ కు పంపాడు. తన తొలి ఓవర్ ఐదో బంతికి కరుణరత్నేను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ప్రస్తుతం గుణతిలక (5), ఉపుల్ తరంగ (7) క్రీజులో ఉన్నారు. శ్రీలంక ప్రస్తుత స్కోరు ఒక వికెట్ నష్టానికి 16 పరుగులు. మరోవైపు, తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 600 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.  

More Telugu News