bellamkonda srinivas: ఆడియో రిలీజ్ కి రెడీ అవుతోన్న 'జయ జానకి నాయక'

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'జయ జానకి నాయక' సినిమా విడుదలకి ముస్తాబవుతోంది. వచ్చేనెల 11వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ .. రకుల్ జంటగా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఆయన సమకూర్చిన బాణీలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.

 ఈ నెల 31వ తేదీన ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. అతిరథ మహారథుల సమక్షంలో ఈ వేడుకను జరుపుతున్నట్టుగా ఒక స్పెషల్ పోస్టర్ ను కూడా వదిలారు. బోయపాటి మార్క్ యాక్షన్ .. రకుల్ గ్లామర్ .. దేవిశ్రీ సంగీతం ఈ సినిమాకి ప్రధానబలంగా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమాతో బోయపాటి ఖాతాలో మరో హిట్ చేరుతుందేమో చూడాలి.

More Telugu News