dhanush: 'విఐపి 2' రిలీజ్ వాయిదా వెనుక ధనుష్ ప్లాన్!

కోలీవుడ్లో వైవిధ్యభరితమైన చిత్రాలను అందించే యువ హీరోల్లో ధనుష్ ఒకరు. గతంలో ఆయన చేసిన 'విఐపి' సినిమా తమిళంలోనే కాకుండా, తెలుగులోను 'రఘువరన్ బీటెక్' పేరుతో విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా ఆయన 'విఐపి 2' సినిమా చేశాడు. ఈ సినిమాకి ఆయనే నిర్మాత కావడంతో, తన పుట్టిన రోజైన ఈ నెల 28వ తేదీన తమిళ .. తెలుగు భాషల్లో విడుదల చేయాలనుకున్నాడు.

అయితే పనులు పూర్తికాకపోవడం వలన వాయిదా వేస్తున్నట్టుగా చెప్పారు. అందులో నిజం లేదనేది తాజా సమాచారం. ఈ సినిమాలో కాజోల్ కీలకమైన పాత్రను పోషించింది. అంతే కాకుండా బాలీవుడ్ జనాలకి హీరోగా ధనుష్ పరిచయమే. అందువలన హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మూడు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఆగారట .. అదీ సంగతి.

More Telugu News