: వైఎస్ జగన్ పై కాపు కార్పొరేషన్ చైర్మన్ తీవ్ర వ్యాఖ్యలు!

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి శనిగ్రహంలా జగన్ తయారయ్యారంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాపు కార్పొరేషన్ ద్వారా 4.16 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళిక రూపొందించామని, కాపులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేరుస్తారని అన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ రూ.2,500 కోట్లను కాపు సామాజిక వర్గానికి కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

More Telugu News