: మెరీనా బీచ్ లో జయలలిత సమాధిని తొలగించాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్!

చెన్నై మెరీనా బీచ్ లోని జయలలిత సమాధిని తొలగించాలని కోరుతూ న్యాయవాది ఇలంగోవన్ మద్రాసు హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. కోస్టల్ గార్డ్ ప్రాంతాల్లో ఎలాంటి మందిరాలు నిర్మించరాదని, జయ సమాధి నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా, ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మద్రాసు హైకోర్టు వివరణ కోరుతూ, కేసు విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది.

More Telugu News