: ఏకంగా 13 పైసలు పెరిగిన పెట్రోలు ధర... నేటి ధరలు

అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఇండియాలో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. నిన్నటితో పోలిస్తే పెట్రోలు ధర 13 పైసల వరకూ పెరిగింది. డీజిల్ ధర మాత్రం ఒక పైసా మాత్రమే పెరిగింది. వివిధ నగరాల్లో నేటి పెట్రోలు, డీజిల్ ధరలు (లీటరుకు) ఇలా ఉన్నాయి.

న్యూఢిల్లీ: పెట్రోలు - రూ. 64.53, డీజిల్ - రూ. 54.94
కోల్ కతా: పెట్రోలు - రూ. 67.88, డీజిల్ - రూ. 57.68
ముంబై: పెట్రోలు - రూ. 73.87, డీజిల్ - రూ. 58.48
చెన్నై: పెట్రోలు - రూ. 67.01, డీజిల్ - రూ. 57.93
హైదరాబాద్: పెట్రోలు - రూ. 68.55, డీజిల్ - రూ. 59.83

More Telugu News