: 'నీ భార్యను అమ్మి మరుగుదొడ్డి కట్టించు' అన్న కలెక్టర్... షాక్ తిన్న గ్రామస్థులు!

ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చేపట్టిన స్వచ్ఛభారత్‌ ప్రచార కార్యక్రమంలో జిల్లా మెజిస్ట్రేట్ (కలెక్టర్) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. బీహార్‌ లోని ఔరంగాబాద్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ (డీఎమ్‌) డీఎమ్‌ కన్వాల్‌ తనూజ్‌ గ్రామానికి వెళ్లారు. అక్కడ మరుగుదొడ్లు కట్టించుకోవడం, వాటి వల్ల జరిగే లాభనష్టాల గురించి వారికి వివరించారు. ఈ సమయంలో ఒక వ్యక్తి లేచి, తమకు కూడా మరుగుదొడ్డి కట్టించుకోవాలని ఉందని, అయితే అందుకు సరిపడా డబ్బు తమ వద్ద లేదని తెలిపాడు.

దీంతో ఆగ్రహానికి గురైన కన్వాల్ 'డబ్బు లేకపోతే నీ భార్యను అమ్ముకో' అనేశారు. దీంతో గ్రామస్థులంతా షాక్ తిన్నారు. అనంతరం ఆయన కొనసాగిస్తూ, 'అందరికీ చెబుతున్నా వినండి. మీ భార్యల గౌరవం కాపాడుకోవాలంటే మరుగుదొడ్డి తప్పక నిర్మించుకోవాలి. మీ భార్యల విలువ 12,000 రూపాయల కంటే తక్కువని అనుకుంటే మాత్రం మరుగుదొడ్డిని నిర్మించుకోవద్దు' అని సూచించారు. అంతే కాకుండా మరుగుదొడ్ల కోసం ప్రభుత్వం ముందుగా డబ్బులిస్తే వాటిని వేరే అవసరాల కోసం వినియోగించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. దీంతో ఆయనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

More Telugu News