: దుర్మార్గం: చపాతీలు గుండ్రంగా లేవని భార్యను చంపేసిన ప్రబుద్ధుడు!

భార్య చేసిపెట్టిన చపాతీలు గుండ్రంగా లేవన్న కారణంతో కట్టుకున్న భార్యను అతి దారుణంగా చంపేశాడో భర్త. ఢిల్లీలోని జహంగిర్‌పురిలో ఈ ఘటన శనివారం చోటుచేసుకోగా ఆదివారం వెలుగుచూసుంది. వేకువ జామున 4 గంటల సమయంలో బాధిత మహిళ సోదరుడు పోలీసులకు ఫోన్ చేశాడు. తన సోదరి అపస్మారక స్థితిలో తన ఫ్లాట్‌లో పడి ఉందని, ఆమె నాలుగేళ్ల కుమార్తెను ఓ గదిలో బంధించారని పోలీసులకు చెప్పాడు.

అపస్మారక స్థితిలో ఉన్న బాధిత మహిళ సిమ్రన్‌‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఆమె అప్పటికే నాలుగు నెలల గర్భిణి. భర్త పరారీలో ఉన్నాడు. చపాతీల విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవ పడుతుండేవారని, అవి గుండ్రంగా లేవన్న కారణంతో తన తండ్రి కోపగించుకున్నాడని సిమ్రన్ నాలుగేళ్ల కుమార్తె పోలీసులకు తెలిపింది.

శనివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో చపాతీల విషయంలో భార్యాభర్తలు మరోమారు గొడవపడ్డారు. సిమ్రన్‌పై భర్త దాడిచేశాడు. తండ్రిని అడ్డుకోవడానికి కుమార్తె ప్రయత్నించగా ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి బయట గొళ్లెం పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

More Telugu News