fida: 'ఫిదా' నాయికకు మరో ఛాన్స్!

ఒక్క సినిమా హిట్టయితే చాలు, అందులో నటించిన హీరో హీరోయిన్లకు డిమాండ్ వచ్చేస్తుంది. అలాగే తాజాగా 'ఫిదా' సినిమా విజయంతో కథానాయిక సాయిపల్లవి దశ తిరిగింది. ఈ తమిళమ్మాయికి టాలీవుడ్ లో అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా యువ కథానాయకుడు శర్వానంద్ సరసన నటించే ఛాన్స్ ఈ ముద్దుగుమ్మకు వచ్చింది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'మహానుభావుడు' సినిమాలో నటిస్తున్న శర్వానంద్ త్వరలో మరో చిత్రాన్ని చేయనున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో కథానాయిక పాత్రకు సాయిపల్లవిని అడుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.  

More Telugu News